top of page

బీహార్ లో తలపాగా చుట్టిన కేసీఆర్ కారణం అదేనా..!

Updated: Sep 2, 2022



తెలంగాణ సీఎం కేసీఆర్‌ బీహార్‌ పర్యటన ఆశక్తిగా సాగింది. అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిదేళ్లలో మోదీ సర్కార్‌ దేశానికి చేసిందేం లేదని, పైగా వినాశకర పరిస్థితి తీసుకొచ్చిందని ఘాటు విమర్శలు చేశారు. భివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను కేంద్రంలోని బీజేపీ ఇబ్బంది పెడుతోంది. రోడ్లు, రైల్వేలు, ఎయిర్‌పోర్టులు అన్నీ అమ్మేస్తోంది కేంద్రం. అన్నీ అమ్మేసుకుంటూ పోతే ఏం మిగులుతుంది. ‘బేచో ఇండియా’ అనేదే బీజేపీ నినాదం. బీజేపీలో అంతా సత్యహరిశ్చంద్రులే ఉన్నారా? ధర్మం పేరుతో దేశంలో వైషమ్యాలు తెస్తున్నారు. అమెరికా ఎన్నికల్లో మోదీ వేలు పెట్టాల్సిన అవసరం ఏముంది? ‘అబ్‌ కీ బార్‌ ట్రంప్‌ సర్కార్‌’ అనే నినాదం ఎందుకు చేశారు? అంటూ సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా అందరం ఒక తాటిపైనే ఉన్నాం. బీజేపీ ‍వ్యతిరేక కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారనే దానిపై తొందర లేదు. విస్తృతంగా చర్చించాకే నాయకత్వం నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. దర్యాప్తు సంస్థలపై సంచలన విమర్శలు చేసిన సీఎం కేసీఆర్‌.. సీబీఐ లాంటి ఏజెన్సీలకు రాష్ట్రాల్లో ఏం పని అని.. శాంతి భద్రతలు రాష్ట్రాల పరిధిలోని అంశాలని అన్నారు. బీహార్ సీఎం, జేడీయూ నేత నితీష్ కుమార్, ఆర్జేడీ నేత, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తో జాతీయ రాజకీయాలపై కేసీఆర్ చర్చించారు. మొన్నటివరకు బీజేపీతో కలిసి ఉన్న నితీష్ కుమార్ ఇటీవల ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చి ఆర్జేడీతో జతకట్టారు. దీంతో బీహార్ లో కీలకంగా ఉన్న రెండు పార్టీల నేతలతో సమావేశం కావడం ద్వారా.. భవిష్యత్తులో విపక్షాలను ఏకం చేయడంపై దృష్టిసారించాలని చర్చించినట్లు తెలుస్తోంది. అయితే బీహార్ ప్రభుత్వంలో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కలిసి ఉన్నాయి. కేసీఆర్ మాత్రం తాము కాంగ్రెస్ ఉన్న కూటమిలో ఉండబోమని చెప్తూ వస్తున్నారు. మరి కాంగ్రెస్ లేకుండా మిగిలిన పార్టీలన్ని కలిసి కూటమిగా ఏర్పడటానికి అవకాశమే లేదని.. ఏర్పడిన అది విఫల కూటమే అవుతుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఏమి జరగనుందనేది భవిష్యత్తులో తేలనుంది. ఇక రాజకీయ భేటీల తరువాత కేసీఆర్‌ పాట్నా గురుద్వారాను సందర్శించారు. గురుద్వారాలో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. సిక్కుల తలపాగాను ధరించారు. కేసీఆర్‌కు తల్వార్‌ను బహుకరించారు బీహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వియాదవ్‌. గురుద్వారా కమిటీ కేసీఆర్‌ను ఘనంగా సన్మానించింది. బీజేపీ ముక్త్‌ భారత్‌ కోసం ఉద్యమించాలన్నారు సీఎం కేసీఆర్. విద్వేషం పెరిగితే దేశానికి భారీ నష్టమని అన్నారు. విపక్షాలను ఏకంచేసే విషయంపై నితీష్‌తో చర్చించామన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా అందరం ఏకతాటిపై ఉన్నాం. ఎవరు లీడ్‌ చేస్తారో ఎన్నికల సమయంలో చెప్తామని తెలిపారు. విస్తృత చర్చ తర్వాత నాయకత్వాన్ని ఎన్నుకుంటామన్నారు సీఎం కేసీఆర్. దేశంలో వనరులు సమృద్ధిగా ఉన్నా వినియోగించట్లేదు. కేంద్రం మంచిచేస్తే రైతులు ఎందుకు ఉద్యమిస్తారని ప్రశ్నించారు. మేక్‌ ఇన్‌ ఇండియా నినాదం పేరుకు మాత్రమే పరిమితమైంది. వస్తువులు ఇతర దేశాల నుంచి దిగుమతి చేస్తున్నామని ఆరోపించారు కేసీఆర్.

bottom of page